21, జూన్ 2020, ఆదివారం

లాక్ డౌన్ లో చెన్నై కి ...🚆



జూన్ వచ్చేస్తుంది అంటే మళ్లీ భయం మొదలైంది. ఎందుకంటే 20 న వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు. మామూలు రోజులు అయితే భయమే లేదు..కానీ ఇప్పటి పరిస్థితి వేరు కదా..స్కూలు తెరవడం అంటే పిల్లలు ఎలాగూ రారు. మరి టీచర్స్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలి గా. మా స్కూలు నుండి ఇలా పది మందిమి స్వ రాష్ట్రాలకి వెళ్ళాము. మళ్లీ ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటే బోలెడు భయాలు. అది ఫుల్ రెడ్ జోన్. బస్సులు ఎలాగూ లేవు..trains ఉన్నాయో లేదో తెలీదు.. quarantine కి గానీ పంపారంటే అదో తలపోటు. హాస్టల్ తీయరు..వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి..?  ఓ వైపు తమిళనాడు epass తప్పనిసరి చేసింది. ఇప్పుడు మళ్లీ అప్లై చేస్తే వస్తదో రాదో అని..ఇలా అన్నమాట..!! 


సమ్మర్ వెకేషన్ ఏమైనా Corona గురించి పొడిగిస్తారేమో అన్న చిన్న ఆశతో 19 కి trains వెతికా… ఒకే ఒక ట్రైన్ ఉంది.  న్యూ ఢిల్లీ - చెన్నై రాజధాని ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి విజయవాడ మాత్రమే halt ఉంది. దానికి డాడీ కి నాకు tickets బుక్ చేశాను. ఆ టికెట్ pnr నంబర్ తో epass అప్లై చేసా. ఆ రాత్రే pass approve అయిపోయింది. ఒక టెన్షన్ తీరింది. ఇదంతా జూన్ 3 నాటి కథ. తర్వాత పని ఇల్లు వెతుక్కోవడం. సడన్ గా నా అమోఘమైన బుర్రకి ఒక సంగతి గుర్తుకు వచ్చింది. పోయిన జనవరి లో మా స్కూల్ టీచర్ ఒకావిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఇల్లు అప్పటి నుండి ఖాళీ గానే ఉంటుంది. ఆవిడ ను అడిగి ఆ ఓనర్ గారి ఫోన్ నంబర్ తీసుకున్నాము. ఫోన్ చేసి ఇలా మాకు ఆ ఇల్లు కావాలి అంటే సరే అన్నారు. హమ్మయ్య...అన్నీ సెట్ ….అనుకునే లోపు అంతలోనే చెన్నై లో 19 నుండి 30 దాకా లాక్ డౌన్ అన్నారు.🥴😵


మా అందరి బాధ ఏంటంటే జరిగేవి ఆన్లైన్ క్లాసులే..అయినప్పుడు ఇంటి దగ్గర ఉండి చేస్తే ఏంటి అని. ఎవరికీ ఇల్లు వదిలి వెళ్ళడం సుతారమూ ఇష్టం లేదు (నాక్కూడా😒) అందుకే 19 దాకా ఎదురు చూసా...kvs hq నుండి ఏమైనా దానికి సంబంధించిన letter/circular వస్తుందేమో అని…. ఊహూ...ఏం రాలేదు. ఇక ఇప్పుడు అయితే టికెట్ .. పాస్ ...ఇల్లు ఉన్నాయి..ఇంకా ఆలస్యం చేస్తే మళ్లీ ఉంటాయో లేదో అని ఇక వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం. 


కరెంటు కుక్కరు..కరెంటు పొయ్యి...ఇంకా కొన్ని ముఖ్యమైన పప్పులు ఉప్పులు లాంటివి సర్దాం. 19 పొద్దునే మా పాలకొల్లు నుండి భీమవరం ఆటో లో వెళ్ళాం. అక్కడి నుండి విజయవాడ కి బస్ దొరికింది. Temperature check చేసి ఎక్కించారు. విజయవాడ వెళ్లేసరికి సుమారు 11 అయింది. మా ట్రైన్ 2:40 కి. విజయవాడ రైల్వే స్టేషన్లో టికెట్ ఉంటేనే లోపలికి పంపుతున్నారు. అది కూడా ట్రైన్ వచ్చే రెండు గంటల ముందు. మాకు కొంచెం ముందుగానే పంపారు. లోనికి వెళ్లే ముందు లగేజ్ మీద స్ప్రే కొట్టారు. మెటల్ డిటెక్టర్ లాంటి థర్మల్ స్కానర్ ఉంది. అందులోంచి నడిచి లోపలికి వెళ్ళాలి...అసలు ఎలాంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా అయిపోయిందో..ఎప్పుడూ జనంతో ...వచ్చే పోయే రైళ్ళతో కళకళ లాడుతూ ఉండేది కాస్తా నిర్మానుష్యంగా ఉంది. 


ట్రైన్ దిగాక ఇంటికి తీసుకు వెళ్ళడానికి prepaid taxi లకి అనుమతి ఉందని తెలిసింది. అప్పుడు నన్ను చెన్నై నుండి తీసుకొచ్చిన డ్రైవర్ కి ఫోన్ చేస్తే స్టేషన్ కి వస్తా అన్నాడు. అతని పేరు మీద pass కూడా జెనరేట్ చేసాము. అలా ట్రైన్ వచ్చే దాకా వెయిటింగ్ హాల్ లో కూర్చున్నాం. ట్రైన్ కొంచెం ముందే వచ్చేసింది. నాకు డాడీ కి వేరు వేరు బోగీలు వచ్చాయి. కానీ ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. ట్రైన్ అంతా ఖాళీ నే. చాలా తక్కువ మంది ఉన్నారు. TC వస్తాడేమో అనుకుంటే రాలేదు. ట్రైన్ లో చాలా బోర్ కొట్టేసింది. 


చెన్నై సెంట్రల్ లో దిగేసరికి రాత్రి 8:30 అయింది. దిగిన వాళ్ళందర్నీ వరుస లో నిల్చో బెట్టి లగేజ్ మీద స్ప్రే చేశారు. అందరికీ home quarantine stamps ఎడమ చేతి మీద వేశారు (అది అప్పుడే వెలిసిపోయింది😑) ముందుగా టాక్సీ బుక్ చేసుకున్న వారిని వేరే వైపు నుండి temperature check చేసి పంపేశారు. 😊


నాకు ఆశ్చర్యం అనిపించినది ఏంటంటే ...epass గురించి అంత టెన్షన్ పడ్డాము. అసలు అది చూడనేలేదు...🤕 ఇంకా ... స్టాంప్స్ అయితే వేశారు ..వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు..ఎక్కడికి వెళ్తున్నారు అవేం వివరాలు తీసుకోలేదు.. ఏంటో మరి..🤷

ఇక ఇంటికి వచ్చేసి స్నానాలు కానిచ్చి.. ఓట్ మీల్ చేసుకుని తినేసి పడుకున్నాము. మా పది మందిలో ముగ్గురం మాత్రమే చెన్నై నుండి తిరిగి వచ్చాం..మిగిలిన వారి సంగతి ఏమో మరి..20 న mail ద్వారా జాయినింగ్ report ...station చేరుకున్నట్లు ఆధారాలు గా ట్రైన్ టికెట్, epass కాపీ తో సహా పంపేసాను...హ్మ్…ప్రస్తుతానికి అంతే ఇక..👻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...