సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎన్నాళ్ళకో మళ్లీ ఇలా.....

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020 0 Comments
ఇలా బొమ్మలు చూసి వెయ్యటం అంటే చిన్నప్పటి నుండి ఒక పిచ్చి...కానీ చదువు..ఉద్యోగం లో పడి బొమ్మలు వేయటం మొత్తానికి వదిలేసాను అనే చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం తీరిక చిక్కటం తో ఎలా అయినా మళ్లీ నా కళకి పునర్జన్మ నివ్వాలి అని సూపర్ మార్కెట్ నుండి క్లాస్ మేట్ drawing పుస్తకము..రంగులు తెచ్చేసుకున్నా🤩..పోయిన ఆదివారం ఇలా ప్రయత్నించా అన్నమాట...మా అమ్మేమో అందరి బొమ్మలు వేస్తున్నావ్...నా బొమ్మ కూడా వెయ్యి అని మూతి ముడుచుకుంది😜..

పెన్సిల్ తో షేడింగ్ చేయటం నాకంత రాదు..నేర్చుకోవాలి🙄 పెదాల దగ్గర కొంచెం తేడా ఉంది కానీ...మొత్తానికి బాగానే వచ్చింది అనిపించింది...మీరేం అంటారు...🤗



16, నవంబర్ 2014, ఆదివారం

Ek Cup Chya-Movie

ఆదివారం, నవంబర్ 16, 2014 0 Comments

               ప్రతీ శనివారం సాయంత్రం 6.30 కి DDభారతి లో బహుమతులు పొందిన భారతీయ చలన చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.అందులో నిన్న "Ek cup Chya"(2009) అనే మరాఠీ సినిమా వేసారు.సమాచార హక్కు చట్టం పై తీసిన సినిమా అది.


                ఒక బస్ కండక్టర్ కొంకణ్ తీరంలో తన కుటుంబంతో(భార్య,తల్లి,ఇద్దరు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు)నివసిస్తుంటాడు.ఒక రోజు వారికి కరెంటు బిల్లు ఏకంగా 73,000 రూపాయలు వస్తుంది.సాధారణ కుటుంబమైన వారికి అంత మొత్తం ఎలా కట్టగలరు.అసలు సమస్యేంటో కనుక్కుందామని విద్యుత్ కార్యాలయానికి వెళ్తాడు.అక్కడ అందరూ ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఆ డబ్బులు కట్టెయ్యమని.కానీ తను ఎలా కట్టగలడు.అంతే కాకుండా పాత బిల్లులు తీసుకురమ్మంటారు.అవి వారి దగ్గర ఉండవు.చాలా ఒత్తిడికి లోనవుతాడు.భార్య అతణ్ణి ఓదారుస్తుంది. తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఆపేస్తారు.పై అధికారికి దరఖాస్తు చేస్తే దాన్ని వారు పట్టించుకోరు.తన రెండో కొడుకు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్తాయి.
ఇంతలో తనతో పని చేసే బస్సు డ్రైవరు సహాయంతో సమాచార హక్కు చట్టం ద్వారా పల్లె ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న ఒక లేడీ డాక్టరు ను కలుసుకుంటాడు.ఆమె ద్వారా ఆ చట్టం గురించి తెలుసుకుని,దరఖాస్తు చేస్తాడు.


               చివరికి అతని ఇంటికి విద్యుత్ వస్తుంది.నాలుగు నెలలు నూనె దీపంలో చదువుకున్న రెండో కొడుకు పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలుస్తాడు.
సినిమా నాకు చాలా చాలా నచ్చింది.సాధారణమైన కుటుంబంలో ఉండే ప్రేమాభిమానాలను బాగా చూపించారు.అందరూ తప్పక చూడవల్సిన సినిమా అనిపించింది.


21, జులై 2014, సోమవారం

"దృశ్యం"-నా అభిప్రాయం

సోమవారం, జులై 21, 2014 2 Comments






నిన్న నేనూ,మా పెద్దమ్మ వాళ్ళమ్మాయి,తన స్నేహితురాలూ కలిసి "దృశ్యం" చిత్రానికి వెళ్ళాము.థియేటర్ లో జనం బాగానే ఉన్నారు.కొంచెం ముందు వెళ్ళడంవల్ల టికెట్ దొరికింది.


ఇక సినిమా విషయానికొస్తే,కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం.ప్రేక్షకుడికి, ఏమవుతుందా? అనే ఉత్కంఠ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.వికీపీడియా పేజీలో కథ మొత్తం ఉంది.కానీ కథ తెలుసుకోవడం కంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం చుట్టూనే కథ తిరుగుతుంది."ఆగష్టులో ఫలానా తారీఖుల్లో మా హోటల్లోనే ఉన్నారండీ","మా థియేటర్లోనే సినిమా చూశారు","అంత మంచి కస్టమర్లను ఎలా మర్చిపోగల్గుతాం"అని ప్రతీ ఒక్కరూ వెంకటేష్ కి అనుకూలంగా చెప్తూంటే థియేటర్లో ఒకటే కేకలు,చప్పట్లూనూ.


అందరి నటనా బాగుంది.వీరభద్రం మరియు అను(చిన్నపిల్ల) పాత్రలు చిత్రానికే హైలెట్.కానీ వీరభద్రం వెంకటేష్ కుటుంబాన్ని అలా చితక్కొట్టడం చాలా బాధ కలిగించింది.కుటుంబమంతా ఒకే మాట మీద ఉండడం బాగుంది.అంజు(పెద్దమ్మాయి)ని తన కాలేజీలో పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నప్పటి సీన్ కూడా చాలా బాగుంది.ఇంకా పచ్చటి పొలాలు,ఆ ఇంటి చుట్టూ ఉండే దృశ్యాలు బావున్నాయి.పాటలు కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి.సినిమాలోని ప్రతీ సీన్ ని హీరో తనకు అనుకూలంగా మలచుకోవడం చాలా బాగుంది.సినిమాల వల్ల ఇంత తెలివితేటలు వస్తాయా అన్నది మాత్రం ప్రశ్నే!

నాకు నచ్చిన "దృశ్యం" చిత్ర సమీక్షలు

సమీక్ష-1

సమీక్ష-2

Kritika Jayakumar

Esther Anil

14, జులై 2014, సోమవారం

ఈ చిత్రమేమిటో చెప్పండి?

సోమవారం, జులై 14, 2014 2 Comments

డీడీ సప్తగిరిలో ఆణిముత్యాలు కార్యక్రమం గూర్చి చెప్పను కదా.అదే కార్యక్రమంలో ఈ రోజు ఒక చలనచిత్రం ప్రారంభం అయింది.

నిర్మలకి ఇద్దరు కూతుర్లు,రాజసులోచన మరియు సావిత్రి.రాజ సులోచన డాక్టర్ కావలనుకుంటుంది.అలాగే పరీక్ష కూడా పాసవుతుంది.నిర్మల భర్త చనిపోతూ సూర్యకాంతం కొడుకు,జగ్గయ్య కి రాజసులోచన ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆఖరి కోరిక కోరి చనిపోతాడు.కానీ రాజసులోచనకేమో ఇష్టం ఉండదు.ఓ పక్క నుండి తనకి బాలయ్య అనే డాక్టర్ పరిచయమవుతాడు.ఆమె అతణ్ని ప్రేమిస్తూ ఉంటుంది.రాజ సులోచన-జగ్గయ్య పెళ్ళికి ముహూర్తాలు కూడా ఖరారయ్యిపోతాయి.

ఇదీ ఈరోజు జరిగింది.మరి ఇది ఏ చిత్రమో చెప్తారా??

31, మే 2014, శనివారం

"మనం" కి మేము

శనివారం, మే 31, 2014 0 Comments

మొన్న మా అమ్మ,నేను,చెల్లి మనం సినిమాకి వెళ్ళాము.అసలు విక్రమసిమ్హ కి వెళ్దామనుకున్నాం.కానీ ఎందుకో మనం కి వెళ్ళలనిపించింది.చివరిసారి "నాగవల్లి" సినిమాకి చెల్లితో వెళ్ళాను.సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ థియేటర్ కి ఇప్పుడు మనంకి.మారుతి టాకీసుకి ఆటోలో వెళ్ళాము.టిక్కెట్టు 100 రూపాయలు.మేము వెళ్ళేసరికే బాల్కనీ టిక్కెట్స్ అయిపోయాయి.హాల్ మధ్యలో కూర్చున్నాం(కూర్చోబెట్టారు).టిక్కెట్ మీదే సీట్ అలాట్మెంట్ ఉంది.టీవీలోనే అనుకుంటే సినిమా థియేటర్లో కూడా యాడ్స్ గోల తప్పట్లేదు.ప్రభుత్వ జారీ చేసేవైతే పర్వాలేదు కానీ,సబ్బులు,సర్ఫ్ ల యాడ్స్ అవసరం లేదనుకుంటా.జంప్ జిలాని ట్రైలర్ కూడా వేశారు.
ఇక "మనం" కి వస్తే ముందు ఊహించినట్టే బాగుంది.ముఖ్యంగా పిక్చరైజేషన్ చాలా చాలా బావుంది.కెమెరా పనితనం బాగుంది.తర్వాత సంగీతం కూడా,ముఖ్యంగా "కనులను తాకే" పాట నాకు నచ్చింది.సమంతని బాగా చూపించారు.శ్రియ రామలక్ష్మి పాత్రలో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా అనిపించినా బావుంది..నాగార్జున,నాగేశ్వర రావుల నటనే సినిమాకి హైలెట్.ముగింపులో అఖిల్ ఎంట్రీ బావుంది.

మళ్ళీ మందు సన్నివేశాలు,"లేడీస్ ఫస్ట్" సన్నివేశాలు లేకపోయినా సినిమా బావుండేదేమో!అమ్మ సెంటిమెంట్ బాగుంది.
మొత్తానికి సినిమా చాలా బాగుంది.సినిమా చూసిన తర్వాత రోజు "కనులను తాకే" పాటను డౌన్ లోడ్ చేసి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.






26, మే 2014, సోమవారం

ఈ సినిమా ఏంటో చెప్పండి?

సోమవారం, మే 26, 2014 3 Comments

ఉదయం 7.30 కి DD సప్తగిరి లో "ఆణిముత్యాలు" శీర్షికన పాత తెలుగు చలనచిత్రాలను ధారావహిక రూపంలో ప్రసారం చేస్తారు.నాకవి చూడటం అలవాటు.దానిలో భాగంగా ఈరోజు సోమవారం కదా.ఒక చిత్రం ప్రారంభమయింది.దాని పేరు చూడలేకపోయా.
ఈ రోజు జరిగిన భాగం కథ చెపుతాను.ఆ చిత్రం పేరు చెప్పగలరేమో చెప్పండి.
రంగయ్య(ఎస్వీ రంగారావు),సీతమ్మ(పేరు తెలియదు) దంపతులకు ఇద్దరు పిల్లలు.సీతమ్మ గర్భవతి,ఒక బిడ్డను కని పురిట్లోనే చనిపోతుంది.
రంగయ్య వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ప్రమాదం జరిగి రెండు కళ్ళూ పోతాయి.అప్పుల వాళ్ళు డబ్బులు కడితేనే సరుకులు ఇస్తామంటారు.వీరి పక్కింట్లో అల్లు రామలింగయ్య భార్యతో కలిసి ఉంటాడు.అతనికి రంగయ్య అంటే ఇష్టం ఉండదు.అతను అన్న నిష్టూరపు మాటలు విని రంగయ్య భరించలేక ఇంటి నుండి పిల్లలకి చెప్పకుండా వెళ్ళిపోతాడు.ఈ పిల్లలు దిక్కులేనివాళ్ళవుతారు.అల్లు భార్య కి పిల్లలు ఉండరు.అందుకు ఈ పిల్లలంటే ఆవిడకి అభిమానం.ఒకరోజు భర్తకు తెలియకుండా వాళ్ళకి భోజనం ఇస్తుంది.ఈ పిల్లల మూలంగా షావుకారుని తిడుతుంది.ఇవన్నీ తెలిసి అల్లు రామలింగయ్య ఆవిడని తన్ని తరిమేస్తాడు.
ఆ పిల్లలు ఇదంతా వారివల్లే జరుగుతుందనీ,వారి ఇల్లుని అప్పులవాళ్ళు తీసేసుకుంటారనీ తెలిసి ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు.రైళ్ళో TC వచ్చేసరికి ఆ ముగ్గురు పిల్లల్లో పెద్దదైన అమ్మాయి మూడో బాబుతో టికెట్ లేక దొరికిపోతుంది.TC వారిద్దరినీ రైలు నుండి దించేస్తాడు.రెండో అబ్బాయి సీటు కింద పడుకుని అందులోనే ఉండిపోతాడు.
ఆ రెండో బాబు నాటకాల కంపెనీలో చేరుతాడు.మొదటి అమ్మాయి చిన్న బాబుతో కలిసి వానలో తడవకుండ ఉండేందుకు ఒక ఇంటిని ఆశ్రయిస్తుంది.ఆ ఇంటిలో ఆ అమ్మాయి వయసున్న అబ్బాయి,లోపలికి రమ్మని అన్నం పెడతాడు.దీనికి వాళ్ళ నాన్న వద్దంటాడు.
ఈరోజు భాగంలో ఈ కథ జరిగింది.ఇది ఏ చిత్రకథ అయి ఉంటుందో చెప్పండే.....