10, నవంబర్ 2019, ఆదివారం

మైసూరు వెళ్లానోచ్!!

రిగ్గా దీపావళి ముందు రోజు….ఆఫీసు నుండి పిలుపు వచ్చింది. ఎందుకా అని భయపడ్డాను. ఒక లెటర్ చేతిలో పెట్టి టికెట్స్ బుక్ చేసుకోమన్నారు. అదేంటి అంటే నవంబర్ 5-7 మధ్య ZIET మైసూరు లో జరగబోయే workshop కి చెన్నై రీజియన్ నుండి ఎంపికైన prt ల లిస్ట్. అందులో నా పేరు ఉంది.🧐 ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను స్కూల్లో చేరి పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. అందుకే కొంచెం కంగారు గా ఫీలయ్యా. ఒక madam వాళ్లకు తెలిసిన ఇంకో సీనియర్ teacher నంబర్ ఇచ్చారు. "వాళ్ళు తెలుగు వాళ్ళే..ఆమె కూడా ఈ workshop కి వస్తున్నారు అరక్కోణం నుండి..నీకు కొత్త కదా! ఆమెతో కల్సి వెళ్లు" అని చెప్పారు. హమ్మయ్య అనుకున్నా..వెంటనే ఆమెకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. బిజీ ఏమో అని ఊరుకున్నా. ఆ రోజు స్కూలు హాఫ్ డే. తర్వాత మూడు రోజులు దీపావళి సెలవులు. హాస్టల్ కి వచ్చాక డాడీ కి ఫోన్ చేసి ఇలా అని విషయం చెప్పాను. నేను రానా అన్నారు..🙆"అయ్యో డాడీ!!" అని తల పట్టుకున్నా. అవును మరి ఒక్కదాన్నే ఎప్పుడూ దూర ప్రయాణాలు చేయలేదు. వెంటనే IRCTC app తెరిచాను. అప్పటికి seats available ఏం లేవు. నాకు ప్రయాణానికి వీలయ్యే ట్రైన్ కావేరి ఎక్స్ప్రెస్. వెళ్ళేటప్పుడు 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. వచ్చేటప్పుడు కూడా 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. WL నంబర్ సింగిల్ డిజిట్ లో ఉండటం వలన కన్ఫర్మ్ అవుతుంది లే అనే నమ్మకం తో ఉన్నాను. ఆ రాత్రి అరక్కొణం madam ఫోన్ చేశారు. ఇలా కావేరి కి బుక్ చేసుకున్నా madam అని చెప్తే నేను కూడా దానికే చేసుకుంటాను అని అన్నారు.




Google image

తర్వాత రోజు దీపావళి. ఆ రోజు ఇల్లు బాగా గుర్తు వచ్చింది ఎందుకో...mail తెరిచి చూస్తే అర్ధరాత్రి మైసూరు నుండి ఒక మెయిల్ వచ్చింది workshop సంబంధించి. అది పూర్తి చేసి ప్రిన్సిపాల్  సంతకం తీసుకుని ఆ తర్వాతి రోజు లోపు పంపాలి అని ఉంది. నాకైతే టెన్షన్ వచ్చింది. 🙄😰 స్కూలుకు వరుసగా మూడు రోజులు సెలవులాయే. సంతకం ఎలాగో ఏంటో అర్థం కాలేదు. వెంటనే మా hm mam కి ఆ mail విషయం చెప్తే..కంగారు పడకు..స్కూలుకు వచ్చాక చూద్దాం లే అన్నారు..  ఆమె అలా భరోసా ఇచ్చాక మనసు కాస్త కుదుట పడింది.😊 

4 సాయంత్రం ప్రయాణం..నేను టికెట్ తీసుకోవడం సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకున్నా..కానీ వెనక్కి వెళ్లి ఎక్కడం ఎందుకూ అనిపించింది. ఎందుకంటే సెంట్రల్ తర్వాతి హాల్ట్ తిరువళ్ళూరు లో. అది మాకు ఇక్కడికి దగ్గర. ఈ విషయం నాకు మొదట్లో తెలియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ నంబర్ లో పెద్దగా తేడా ఏం రావట్లేదు. పోనీ బస్ కి వెళ్తే ఎలాగ అని అనిపించి రెడ్ బస్ లో చూసాను. నాకేం అర్థం కాలేదు..ఆ పికప్ పాయింట్స్..dropping points..😵ఇక తత్కాల్ నే నమ్ముకున్నా. అదీ కుదరకపోతే అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని ప్లాన్ వేసాను. 3న తత్కాల్ చేయాలి. అనుకూలంగా ఆదివారం వచ్చింది. పొద్దునే 9:45 నుండి app తెరిచి పెట్టి refresh చేస్తూ కూర్చున్నా. 3AC ఏమో 10, 2AC ఏమో 17 టికెట్స్ ఉన్నాయి. 2Ac ఎక్కువగా ఉన్నాయి కదా అని అది ముందు చేసా. కొంచెం ఖర్చు ఎక్కువైనా తిరువళ్ళూరు నుండే టికెట్ దొరికింది😋. ఒక టెన్షన్ వదిలింది. ముందు చేసిన టికెట్ WL 4తోనే ఆగిపోయింది. ఇక అది కాన్సెల్ చేసేసా. తిరుగు ప్రయాణం కి ఎందుకైనా మంచిది అని స్లీపర్ టికెట్ కూడా చేసి పెట్టాను. అది కానీ కన్ఫర్మ్ కాకపోతే కనీసం SL లో rac అయినా వస్తుంది కదా అని. ఆ ఆదివారం ప్రయాణం కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా. NCERT బుక్స్ తెచ్చుకోమని అన్నారు కానీ….అన్నీ ఎలా మోసుకుని వెళ్లగలం అందుకే అన్నీ soft copies ఇంకా నా దగ్గర ఉన్న రెండు పుస్తకాలు తీసుకెళ్ళా. 

ఇక తర్వాతి రోజు సోమవారం స్కూలు నుండి వచ్చేసరికి 5 అయింది. వెంటవెంటనే బ్యాగ్స్ సర్దేసి రాత్రి హాస్టల్ లో పెట్టిన చపాతీ లు తినేసి..7:30 కల్ల దగ్గర్లోని సబర్బన్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడి నుండి తిరువళ్ళూరు ఒక అరగంట...ఇంకో madam ఏమో అరక్కోణం లో ఎక్కుతారు. 9 నుండి 10 దాకా ఒక్కదాన్నే అలా స్టేషన్ లో కూర్చున్నా. ఏసీ కోచ్ ప్రయాణం నాకు ఇదే మొదటిసారి. లోయర్ బెర్త్ వచ్చింది నాకు. దుప్పట్లు, చిన్న తలగడ, రగ్గు ఉన్నాయి. బాగా అనిపించింది. ఎక్కినట్టు ఇంటికి ఫోన్ చేసి వెంటనే పడుకున్నాను. బాగా నిద్ర పట్టింది. 

హైదరాబాదు లో ట్రైన్ లో ఉంటే అస్సలు నెట్ కనెక్ట్ అయ్యేదే కాదు నాకు..కానీ ఇక్కడ బాగానే అవుతుంది. పొద్దునే లేచి ఫోన్ చూసేసరికి బర్త్ డే విషెస్ ఉన్నాయి..కొంతమంది ఫోన్ చేసి మరీ విష్ చేశారు🤩..మైసూర్ చేరేసరికి 7 అయింది. ఆవిడ చెప్పిన బోగీ దగ్గరికి వెళ్ళాను. బాగానే గుర్తు పట్టాను. పచ్చ చీర అని మాత్రమే చెప్పారు😁. బయటకి వచ్చి ఓలా పాయింట్ లో ZIET కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. చేరుకోవటానికి ఒక పది నిముషాలు పట్టింది. మేం ఇద్దరం కలిపి ఒక రూం తీసుకున్నాం అక్కడి గెస్ట్ హౌస్ లో. 




ఈ Zonal Institute of research and training అనేది దేశంలో ఉన్న 5 ZIET s లో ఒకటి. దీని పరిధిలోకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, మరియు మహే వస్తాయి. త్వరత్వరగా రెడీ అయిపోయి టిఫిన్ చేసి, registration కార్యక్రమాలు ముగించకొని lecture hall కి వెళ్ళాము. అసలు workshop దేనికీ అంటే "workshop on enrichment programmes in maths and evs for gifted students for classes 3-5" . మొదటి రోజు పొద్దున నుండి సాయంకాలం వరకు lectures ఇచ్చారు. మధ్యలో కొంత సేపు గ్రూప్ ఫోటో సెషన్. మా 34 మందినీ evs, maths ఇలా రెండు గ్రూపులు చేశారు. మళ్లీ అందులో 5-6 మందిని తరగతుల వారీగా విడగొట్టారు. అలా నాకు 5th evs వచ్చింది. ...అలా ఒక్కొక్కరికి కొన్ని chapters కేటాయించి ఒక్కో చాప్టర్ కి సంబంధించి theme mapping, preparing enrichment projects for gifted అలాగే HOTS ప్రశ్నలు తయారు చేయడం లాంటివి assignments గా ఇచ్చారు. అవన్నీ soft copies కావాలని అన్నారు. 

పొద్దున breakfast, lunch వాళ్ళే పెట్టారు కానీ..రాత్రి భోజనం మనమే చూసుకోవాలి. అలా మొదటి రోజు దగ్గర్లోని రెస్టారెంట్ "దోశ కార్నర్" కి వెళ్లి ఉల్లి దోశ తిన్నాను. తర్వాతి రోజు సగం సమయం assignments చేయటానికి కేటాయించారు. ఆ రోజు ZIET వాళ్ళే ఒక బస్సు మాట్లాడి పెట్టారు శ్రీ రంగపట్నం, చాముండి హిల్స్ కి. డబ్బులు అందరూ పంచుకునేట్లు గా...క్లాసులు అవ్వగానే సాయంత్రం 6 కి బస్సు బయల్దేరింది. మొదటగా శ్రీ రంగనాథ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడేమో స్వామి వారికి అలంకరణ చేస్తున్నారు. అందుకే పరదాలతో కప్పేసారు...అప్పటికే అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. 5నిముషాలు..10 నిముషాలు..అంటూ గంట పాటు అక్కడే ఉన్నాం. చివరికి దర్శనం బాగా చేసుకున్నాం. శేష పాన్పు పైన పవళిస్తున్న నల్ల రాతి విగ్రహం చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. 😻ఆలయ ప్రాంగణం కూడా చాలా చల్లగా అనిపించింది. ఇప్పుడు చలికాలం అయినా చెన్నై లో అలాంటి ఫీలింగ్ యే రావట్లేదు. కానీ అక్కడ ఎప్పుడూ అలాగే చల్లగా ఉంటుంది అంట మైసూరు లో. చాముండేశ్వరి గుడి 9 కి మూసేస్తారు అని వెంటనే మళ్లీ 8 కి బస్సు ఎక్కేసాం. ఘాట్ రోడ్ ప్రయాణం భలేగా ఉంది. ఉత్తరాది వారు పాటలు పాడుతూ వాతావరణాన్ని ఉల్లాస పర్చారు. మధ్యలో కొండ పైనుండి మైసూరు నగర వీక్షణ ఎంత బాగుందో!!😍🤩😍😍 మాటల్లో చెప్పలేం. అక్కడ కూడా వెంటవెంటనే దర్శనం అయిపోయింది. అలా నేను దర్శించిన మొట్ట మొదటి శక్తి పీఠం మైసూరు అయింది. 

ఫోటో లన్నీ చీకట్లో తీయాల్సి వచ్చింది..అందుకే కొంచెం ఎడిట్ చేసా🤫







మధ్యలో ఒక రెస్టరెంట్ దగ్గర బస్ ఆపారు... భోజనం కోసం. నేనేమో ఫ్రైడ్ వెజ్ రైస్ చెప్పాను. నాలాగ ఇంకో ముగ్గురు ఉన్నారు. 10 దాటింది అప్పటికే. కడుపులో ఎలుకలు పరుగు పందెం పెట్టుకున్నట్టు ఉంది. అలా ఇంచుమించు అరగంట వెయిట్ చేయించారు. కానీ ఆర్డర్ తేవట్లేదు. ఐటమ్స్ లేవు అని చావు కబురు చల్లగా చెప్పాడు.😬😖మేము ముగ్గురం బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని దగ్గర్లోని "లెమన్ ట్రీ" కి వెళ్లి తిన్నాం. 11కి తింటే ఏం సయిస్తుంది. తినాలి కాబట్టి మమ అనిపించాను. అక్కడి నుండి నడుచుకుంటూ ziet కి 11:30 కల్ల వచ్చేశాం...ఇదొక అడ్వెంచర్😝😜

చివరి రోజు అయిన గురువారం కొంచెం బోరింగ్ గా జరిగింది. కంప్యూటర్ లాబ్ లో కూర్చుని అసైన్మెంట్స్ పూర్తి చేసి ...class wise..subject wise..అన్నీ ఒక ఫైల్ గా చేశాం..దానికే చాలా టైం పట్టేసింది. Ziet డైరెక్టర్ అయిన శ్రీమతి లక్ష్మి చారి mam , "students safety in schools" (sss) మీద తీసుకున్న సెషన్ బాగుంది. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆ రోజు సాయంత్రం presentations అయ్యాక అందరికీ ప్రశంసా పత్రాలు, "మైసూర్ పాక్" పాకెట్ ఇచ్చారు😋. ఇక వెంటనే మేము మా లగేజ్ సర్దేసుకునీ వెళ్లడానికి తయారయ్యాం. మా ఇద్దరికీ ఇంకొకరు తోడయ్యారు. ఆమె కూడా కావేరి కే వస్తున్నారు. అలా ముగ్గురం కల్సి స్టేషన్ కి వచ్చేశాం. అక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకున్నాం.🤳 స్టేషన్ దగ్గర్లో ఉన్న "adyar anand bhavan" లో టిఫిన్ చేసి రైలెక్కాము. నాకు 3AC RAC వచ్చింది. బెర్త్ ఏమైనా దొరుకుతుందా అని టీసి నీ అడిగితే బెంగుళూరు దాటాక నే అన్నాడు. ఒంటి గంట కి ఒక బెర్తు ఇచ్చాడు😴💤 అలా హాస్టల్ కీ వచ్చేసి గబగబా తయారయ్యి స్కూలుకు వెళ్ళిపోయాను. మూడు రోజులు నిద్ర సరిగా లేక బాగా నీరసం అనిపించింది. కానీ తప్పదు గా…

ఇంకొన్ని ...






అలా మొత్తానికి మైసూరు ప్రయాణం చాలా బాగా జరిగింది. బోలెడు జ్ఞాపకాలు ను మిగిల్చింది. Busy schedule అయినా కూడా అంత టెన్షన్ అనిపించలేదు. అక్కడ కల్సిన వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు కేవీ ఇంటర్వ్యూ లో నా ముందు నెంబర్ అయిన నమ్రత అనే అమ్మాయి ఇక్కడ పరిచయం అయింది. నేనే గుర్తు పట్టి పలకరించాను. ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి...🤗🤗 కానీ ఇప్పటికే ఆంజనేయుడి తోక లాగా అయింది కదా..అని ఇక్కడితో ఆపేస్తున్న...ఉంటా మరి!!!👋


4 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...