8, ఏప్రిల్ 2013, సోమవారం

తరగతులు



రెండవ రోజున తరగతులకెళ్లాము.టైంటేబుల్ చెప్పారు.వరుసగా నాలుగు తరగతులు జరుగుతాయి.గణితం,భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం,ఆంగ్లం.తెలుగు వారానికొకసారి సోమవారం జరుగుతుంది.జీవశాస్త్రాన్ని ఐచ్చికాంశంగా వేసవి శెలవుల్లో పెడతారట. అక్కడి లెక్చరర్స్ ని మెంటార్స్ అని పిలుస్తారు. మ్యాథ్స్ కి మీనాక్షి ,ఫిజిక్స్ కి స్వప్న కెమిస్ట్రీ కి వెంకట రావు ,ఇంగ్లీషు కి శ్రీనివాసరావ్,తెలుగుకి హరిబాబు.
ఆ రోజు అందరూ మా పరిచయాలు అడిగారు.ప్రతీ ఒక్కరికీ మా గురించి చెప్పాం.ఫిజిక్స్ మాడం అయితే పాఠాలు మొదలు పెట్టేసింది.పిల్లలందరూ ఆవిడ అడిగిన వాటికి సమాధానాలు చెప్పేస్తున్నారు.నాకేమో ఏమీ అర్ధం కావట్లేదు.వాళ్ళందరూ ఇక్కడ చేరక ముందు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకున్నారు.అందుకే అన్నీ చెప్పేస్తున్నారు.
మధ్యాహ్నం తరగతులు జరగవు.అప్పటి విధానం ప్రకారం (అక్కడి పాఠాలను Modules అంటారు) ఉదయం జరిగిన moduleకి మధ్యాహ్నం పరీక్ష రాయాలి. అన్ని సబ్జెక్టులకీ. కానీ ఇప్పుడు ఆ పధ్ధతి లేదు.ఇప్పుదు ఏంటంటే వారాంతపు పరీక్షలన్నమాట.అప్పటికి మాకు Laptops ఇవ్వలేదు.NCERT పుస్తకాలు ఇచ్చారు. మా Syllabus వేరుగా ఉంటుంది.NCERT కాదు,తెలుగు అకాడెమీ కూడా కాదు.రెండూ కలిపి ఉంటుంది.కాకపోతే NCERT కి దగ్గరగా ఉంటుంది.మా తరగతి లో అబ్బాయిలు చాలా చురుకుగా ఉంటారు. వాళ్ళళ్ళో నలుగురికి పదవ తరగతిలో 10GPA వచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...