5, జులై 2014, శనివారం

డిసెంబరు నెల సైన్సు సంగతులు



1-1971-భారతదేశంలో మొట్టమొదటి మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ తమిళనాడు 

వేలూరులోని సి.ఎం.సి.ఆసుపత్రిలో విజయవంతగా జరిగింది.



2-1942-న్యూక్లియర్ గొలుసు చర్యను "ఎన్రికో ఫెర్మి" సాధించారు.


3-1910-పారిస్ లో నియాన్ కాంతి దీపాలను వాడటం ప్రారంభించారు.


4-1131-ఇరాన్ లోని నైషాపూర్ లో 18-5-1048 న జన్మించిన ఖగోళ శాస్త్రవేత్త,కవి "ఉమర్ 

ఖయ్యాం" మరణం.


6-1877-"థామస్ ఆల్వా ఎడిసన్" మానవ స్వరాన్ని మొట్టమొదటి సారిగా రికార్డు చేసిన 

రోజు."Mark Had a Little Lamb" అనే తన మాటలను తానే రికార్డు చేసారు.


7-1972-చంద్రునిపై అపోలో ప్రయోగశాలలో చివరిదైన "అపోలో-17" అంతరిక్ష నౌక 

ప్రయోగింపబడిన రోజు.


8-1993-అంతరిక్ష నౌక "ఎండీవర్" సిబ్బంది అంతరిక్ష కక్ష్యలో "హబుల్ స్పేస్ టెలీస్కోపును

బాగు చేశారు.


9-1868-వాతావరణపు నైట్రొజన్ నుండి అమ్మోనియాను తయారు చేసి,1918లో రసాయన 

శాస్త్రంలో నోబెల్ ను పొందిన జర్మనీ శాస్త్రవేత్త "ఫ్రెడ్జి హేబర్" జననం.


10-1896-నైట్రోగ్లిజరిన్ ను ఉపయోగించి డైనమైట్ ను తయారు చేసిన స్వీడిష్ శాస్త్రవేత్త "ఆల్ఫ్రెడ్

 నోబెల్" మరణం.


11-1843-క్షయ వ్యాధికి మందును కనుగొని,1905లో నోబెల్ బహుమతిని పొందిన జర్మనీ 

శాస్త్రవేత్త "డాక్టర్ రాబర్ట్" జననం.


12-1866-పరమాణువుల మధ్య రసాయన బంధాలను వివరించి,1913లో నోబెల్ పొందిన 

రసాయన శాస్త్రవేత్త "ఆల్ఫ్రెడ్ వెర్నర్" జననం.


13-1930-సేంద్రీయ పదార్ధాల సూక్ష్మ విశ్లేషణకు గానూ 1923లో నోబెల్ ను పొందిన ఆస్ట్రేలియా 

శాస్త్రవేత్త "ఫ్రిట్జ్ ప్రీగల్" మరణం.


14-1958-పౌలీవర్జన సూత్రం రూపొందించినందుకు గాను 1945లో నోబెల్ ను పొందిన "ఊల్ఫ్ 

గాంగ్ పౌలి" మరణం.


15-1852-"సహజ రేడియో ధార్మికత కనుగొన్నందుకు మేడం క్యూరీ దంపతులతో పాటుగా 

1903లో నోబెల్ ను పొందిన ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త "ఆంటోనీ హెన్రీ బెకెరెల్" జననం.


16-1796-సూర్యునికి,గ్రహాలకు మధ్య గల సంబంధాలను గురించి వివరించే "టిటినీ-బోడ్" 

సూత్రం రూపకర్త,జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త "జోడాన్ టిటిస్" మరణం.


17-1778-సేఫ్టీల్యాండ్ రూపకర్త,బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త "హంఫ్రీ డేవీ" జననం.


18-1856-ఎలక్ట్రాన్ ఆవిష్కరణకు 1906లో నోబెల్ ను పొందిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త "జోసెఫ్ 

జాన్ థాంసన్" జననం.


19-1852-కాంతికి సంబంధించిన గణనలకు,వర్ణపట అధ్యయనానికి గానూ 1907లో నోబెల్ ను 

పొందిన శాస్త్రవేత్త "ఆల్బర్ట్ అబ్రహాం మైఖేల్సన్" జననం.


20-1890-ఎలక్ట్రో కెమికల్ ఎనాలసిస్ కు సంబంధించిన పోలార్ గ్రాఫిక్ టెక్నిక్ రూపొందించి 

1959లో నోబెల్ ను పొందిన రసాయన శాస్త్రవేత్త "జరొస్లార్ శ్రీరోవ్స్కీ" జననం.


21-1978-మానవరహిత అంతరిక్ష నౌక "వెనీరా-11" శుక్రగ్రహం మీద దిగి,దాదాపు గంట సేపు

 చిత్రాలను పంపిన రోజు.


22-1887-రాయల్ సొసైటీలో ఫెలోషిప్ అందుకున్న తొలి భారతీయుడు,గణిత శాస్త్రవేత్త "శ్రీనివాస

 రామానుజన్" జననం.


23-1956-అమెరికా శాస్త్రవేత్తలు "విలియం షాక్లీ","వాల్టర్ బ్రిటన్","జాన్ బర్డీన్" పరిశోధనతో 

ట్రాన్సిస్టర్ ఆవిష్కరించబడిన రోజు.


24-1843-వివిధ శక్తి రూపాల మధ్య మార్పిడి సూత్రాన్ని ప్రతిపాదించిన "జేంస్ జౌల్" జననం.


25-1642-గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త,స్పెక్ట్రాగ్రాఫ్,స్పెక్ట్రామీటర్ పరికరాల రూపకర్త,"ఫిలసోఫియా 

నాచురాలిస్ ప్రిన్సిపియా మాథమేటికా" గ్రంథకర్త "సర్ ఐజాక్ న్యూటన్" జననం.


26-1792-"డిఫరెన్స్ ఇంజన్" అని పిలువబడిన "మెకానికల్ కంప్యూటర్" రూపశిల్పి,గణిత 

శాస్త్రవేత్త "చారెస్ బాబేజ్" జననం.


27-1571-గ్రహచలన సిద్ధాంతాలను ప్రతిపాదించిన "జోహెన్నెస్ కెప్లర్" జననం.


28-1829-"బయాలజీ" అన్న పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టిన "లామార్క్" మరణం.


29-1993-జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అమెరికాలో సమావేశం జరిగిన రోజు.భారత్ సహా 

వందకు పైగా దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.డిసెంబరు 29న అంతర్జాతీయ జీవవైవిధ్య 

దినోత్సవంగా పాటిస్తారు.


30-1971-భారత్ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి,అహ్మదాబాద్లో వస్త్ర 

కర్మాగారాల పరిశోధన సంస్థ స్థాపనకు కారకుడు,శాస్త్రవేత్త "డా.విక్రం సారాభాయ్" మరణం.


31-1991-ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ(1956) కు,"అతివాహకత్వం" వివరించినందుకు(1972) రెండు

 సార్లు నోబెల్ అందుకున్న "జాన్ బర్డీన్" మరణం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...